కోల్కతా, జూలై 21: ‘పెగాసస్ గూఢచర్యం’పై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని ‘నిఘా రాజ్యం’గా మార్చేయాలని మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. తన ఫోన్ను కేంద్రం ట్యాప్ చేసిందన్నారు. పెగాసస్ వ్యవహారంపై సుప్రీంకోర్టు దర్యాప్తు చేయాలని కోరారు. 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్ష పార్టీలు ఏకతాటిపైకి రావాలని కోరారు. కోల్కతాలో ‘అమరవీరుల రోజు’ సందర్భంగా ఆమె ప్రసంగించారు. మరోవైపు, పెగాసస్ స్పైవేర్తో హ్యాకింగ్ వ్యవహారంపై పలువురు కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులను కాంగ్రెస్ నేత శశి థరూర్ నేతృత్వంలోని పార్లమెంటరీ స్టాండిగ్ కమిటీ (ఐటీ) త్వరలో ప్రశ్నించనున్నట్టు సమాచారం.