కోల్ కతా : కరోనా వైరస్ కేసులు పెరుగుతుంటే రాజకీయ పార్టీల ర్యాలీలు, రోడ్ షోలకు ఈసీ అనుమతించడం పట్ల మద్రాస్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. కొవిడ్-19 సెకండ్ వేవ్ కు ఈసీదే బాధ్యతని హైకోర్ట్ చేసిన వ్యాఖ్యలను దీదీ స్వాగతించారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఏడో దశ పోలింగ్ లో కోల్ కతాలో తన ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఆమె మాట్లాడారు.
బెంగాల్ లో కరోనా వ్యాప్తికి కారణమైన కేంద్ర బలగాలను ఈసీ ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ఇక కొవిడ్-19 వ్యాప్తికి ఈసీ బాధ్యతారాహిత్య వైఖరే కారణమని అంతకుముందు మద్రాస్ హైకోర్ట్ ఈసీ తీరును తప్పుపట్టింది. ఈసీ అధికారులను ఇందుకు బాధ్యలును చేస్తూ వారిపై కేసు నమోదు చేయాలని తీవ్ర వ్యాఖ్యలు చేసింది.