గోదావరి జలాలతో కళకళలాడుతున్న నీటి వనరులు
సంబురపడుతున్న రైతులు, గ్రామస్తులు
రుద్రంగి, ఏప్రిల్ 11: కాళేశ్వరం జలాలతో మండల కేంద్రంలోని చెరువులు నిండుకుండలా మరాయి. మండల కేంద్రంలోని నాగారం చెరువు, ఎల్లయ్యకుంట చెరువు నీటితో కళకళలాడుతున్నాయి. ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు ఆదేశాల మేరకు నాగారం చెరువు ఆయకట్టు రైతులను ఆదుకునేందుకు తూం నుంచి కాలువ ద్వారా నీటిని వదిలారు. భూగర్భజలాలు అడుగంటి న క్రమంలో చివరి దశలో ఉన్న పంటపొలాలకు సాగునీరు అందడంతో రైతులు సంబురపడుతున్నారు. మండుటెండల్లో చెరువుల్లోకి నీరు రావడంతో యువకులు, చిన్నారులు ఈత కొడుతూ సేద తీరుతున్నారు. రైతుల సంక్షేమానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యేకు ఎంపీపీ గంగం స్వరూపారాణి, జడ్పీటీసీ గట్ల మీనయ్య కృతజ్ఞతలు తెలిపారు.