హైదరాబాద్ : పశుసంవర్థక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ను వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసంలో నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ మర్యాద పూర్వకంగా కలిశారు.
తన విజయానికి కృషి చేసిన ఆయనకు మంత్రికి శాలువా కప్పి సత్కరించి ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరారు.
ఇటీవల జరిగిన నాగార్జున సాగర్ నియోజకవర్గ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన నోముల భగత్ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిపై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.