న్యూఢిల్లీ, జూలై 28: అస్సాం, మిజోరం సరిహద్దుల్లో వివాదాస్పద ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు తటస్థ బలగాలను మోహరించడానికి ఇరు రాష్ర్టాలు అంగీకరించాయి. కేంద్రం హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా నేతృత్వంలో రెండు రాష్ర్టాల సీఎస్లతో బుధవారం జరిగిన కీలక సమావేశంలో ఈ మేరకు ఒప్పందానికి వచ్చాయి. వివాదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని నిర్ణయించాయి.