నాగర్ కర్నూల్ : నల్లమల అడవుల్లో జంతువులను వేటాడి వాటి కళేబరాలతో అటవీ ప్రాంతం నుంచి వెళ్లిపోయిన వేటగాళ్లను కెమెరాలు పట్టించాయి. జిల్లాలోని అచ్చంపేట మండలం చౌటపల్లి గ్రామ పరిధిలోని మైసమ్మ మడుగు అటవీప్రాంతంలో గత కొన్ని రోజుల కిందట అడవిలోకి అనుమతి లేకుండా ప్రవేశించి, ఉచ్చులు, గొడ్డల్లతో చుక్కల దుప్పి, సాంబార్ అనే అడివి జంతువులను వేటాడి వాటి కలేభరాలతో వస్తున్న క్రమంలో అటవీ శాఖ వారు అమర్చిన కెమెరాలకు చిక్కారు. 10 మంది నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. వారిపై కేసు నమోదు చేసి అచ్చంపేట కోర్టులో హాజరు పరుచగా వారికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిందని అటవీ శాఖ అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ఖమ్మం మార్కెట్లో రికార్డు స్థాయి ధర పలికిన తెల్ల బంగారం
ఎన్నికల హామీని నిలబెట్టుకున్న మంత్రి ఐకే రెడ్డి
పాత్రికేయులకు నిత్యావసర సరుకులు పంపిణీ
వరంగల్ సెంట్రల్ జైలును సందర్శించిన రాజీవ్ త్రివేది
రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన