భువనేశ్వర్: యాస్ తుఫాన్ శరవేగంగా తీరంవైపు దూసుకొస్తున్నది. మరికొన్ని గంటల్లో అది ఒడిశా, పశ్చిమబెంగాల్ సరిహద్దుల్లో ఒడిశా తీరాన్ని తాకనుంది. తుఫాన్ తీరానికి చేరువైనా కొద్ది తీర ప్రాంతాల్లో సముద్రం ఉగ్రరూపం దాల్చుతున్నది. ఉవ్వెత్తున రాకాసి అలలు ఎగిసిపడుతున్నాయి. చెవులకు చిల్లులు పడేలా సముద్రపు హోరు దద్దరిల్లుతున్నది. ఒడిశాలోని పారాదీప్ వద్ద సముద్రం ఉగ్రరూపానికి సంబంధించిన దృశ్యాలను కింది వీడియోలో వీక్షించవచ్చు.