సిటీబ్యూరో, జూన్ 3 ( నమస్తే తెలంగాణ ) : ఆయనకు యువనేతే స్ఫూర్తి.. మంత్రి కేటీఆర్ను ఆదర్శంగా తీసుకొని.. ఆపత్కాలంలో అన్నార్తులకు అండగా నిలుస్తున్నారు. కొవిడ్ బాధితుల్లో భరోసా నింపుతూ.. వారు కోలుకునే వరకు ఆత్మబంధువులా సేవలందిస్తున్నారు టీఆర్ఎస్ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ వై. సతీశ్రెడ్డి. ‘గిఫ్ట్ ఏ స్మైల్’ పేరుతో నెల రోజులుగా పాజిటివ్ రోగులకు పౌష్టికాహారం అందిస్తున్నారు. మాస్కులు, శానిటైజర్లు సైతం పంపిణీ చేస్తూ.. సేవాగుణాన్ని చాటుకుంటున్నారు హైదరాబాద్తో పాటు ములుగు జిల్లా అటవీ ప్రాంతాల్లోనూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఇంట్లో వంట చేసుకోలేని కరోనా బాధితులకు ప్రతి రోజూ మధ్యాహ్నం, రాత్రి పోషకాహారాలతో కూడిన కమ్మని భోజనాలను వారి గృహాల వద్దకే వెళ్లి అందిస్తున్నారు. కౌశిక్, రాజు, షఫీ, సంతోష్, అనిల్గౌడ్, మహర్షి, రోహిత్లతో జట్టుగా ఏర్పడిన సతీశ్రెడ్డి. ప్రతి రోజూ సుమారు 200 మందికిపైగా కొవిడ్ రోగులకు రెండుపూటలా భోజనాలను పంపిణీ చేస్తున్నారు. మహమ్మారి సద్దుమణిగేంత వరకు ఇది కొనసాగుతుందని సతీశ్రెడ్డి స్పష్టం చేస్తున్నారు. నాగోల్, ఎల్బీనగర్, కొత్తపేట, ఉప్పల్, రామంతపూర్, హబ్సీగూడ, మౌలాలి, బోడుప్పల్, మన్సురాబాద్ తదితర సమీప ప్రాంతాల్లో హోం ఐసొలేషన్లో ఉన్న రోగులకు కావాల్సిన భోజనాన్ని ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు. పౌష్టికాహారం కావాలనుకునే వారు 96414 66666, 73311 38990, 7893812990ల నంబర్లలో సంప్రదించాలని సూచిస్తున్నారు.
‘మీరు త్వరగా కోలుకొని మంచి ఆరోగ్యంతో ఉండాలని అని కోరుకుంటున్నాను. మీరు కోలుకున్నాక అవసరమైన వారికి సహాయం చేస్తారని నేను ఆశిస్తున్నాను.” అని కేటీఆర్ పేరుతో రాసి ఉన్న కార్డును కొవిడ్ రోగులకు అందించి.. వారిలో సేవా ధృక్పథం వెల్లివిరిసేలా సతీశ్రెడ్డి చేస్తున్నారు. దీనికి అన్యూహ స్పందన లభిస్తున్నదని, కచ్చితంగా సాయం చేస్తామని బదులుగా చెబుతున్నారని సతీశ్రెడ్డి వివరించారు. మంత్రి కేటీఆర్ ఆలోచన బాగుందని, నిజమైన నాయకుడు ఇలా ఆలోచిస్తాడని అంటున్నారని పేర్కొన్నారు. దేవుడి ఆశీస్సులు ఆయనపై ఎల్లవేళలా ఉండాలని దీవిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు.