ఎల్బీనగర్, జూన్ 2: రాష్ట్రం అన్ని రంగాల్లో గొప్ప విజయాలు సాధించిందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా లింగోజిగూడ డివిజన్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద జాతీయ పతాకంతో పాటుగా టీఆర్ఎస్ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాగు, సాగునీరు, విద్యుత్, వ్యవసాయం, పరిశ్రమలు, సంక్షేమ రంగాల్లో ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఎన్నో కొత్త సంక్షేమ ఫలాలను అందించి అగ్రభాగాన ఉందన్నారు. లాక్డౌన్ సమయంలో కొవిడ్ నేపథ్యంలో ప్రజలు ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలు పాటించాలన్నారు. కరోనా కష్టకాలంలో ప్రతిఒక్కరూ నిరుపేదలకు సాయం చేయాలన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాస్రావు, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు తిలక్, నాయకులు నర్రె శ్రీనివాస్ కురుమ, శ్రీధర్గౌడ్, భాస్కర్ గంగపుత్ర, శ్రావణ్కుమార్, జూపల్లి ప్రవీణ్, అజిం, శ్రీధర్, కుమార్, శ్రీనివాస్, ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
హస్తినాపురం డివిజన్ నందనవనం కాలనీలో రాష్ట్ర ఆవిర్భావ దినం సందర్భంగా ఎల్బీనగర్ టీఆర్ఎస్ ఇన్చార్జి ముద్దగౌని రామ్మోహన్గౌడ్ జాతీయ పతాకంతో పాటుగా టీఆర్ఎస్ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.
ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చైతన్యపురి డివిజన్లోని ప్రభాత్నగర్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మాజీ కార్పొరేటర్ జిన్నారం విఠల్రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లికి పూలమాలలు వేసి అనంతరం జాతీయ పతాకాన్ని, టీఆర్ఎస్ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు పాల్గొన్నారు.
గడ్డిఅన్నారం డివిజన్లో మాజీ కార్పొరేటర్ భవాని ఆధ్వర్యంలో పార్టీ నాయకులు జెండాలను ఎగురవేశారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు బిచినేపల్లి వెంకటేశ్వర్రావు, రమేశ్ముదిరాజ్, బాలసుందరం, రవిచారి, శ్రీశైలంయాదవ్, రవీందర్రెడ్డి, నాగరాజు, శైలజ, అరుంధతి, పరమేశ్వరి, వాణి తదితరులు పాల్గొన్నారు.
దిల్సుఖ్నగర్ రాజీవ్చౌక్ వద్ద వేడుకలను టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు పీచర వెంకటేశ్వర్రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు వూర నర్సింహగుప్తా, తుమ్మలపల్లి రవీందర్రెడ్డి, ప్రేంనాథ్గౌడ్, బిచినేపల్లి వెంకటేశ్వర్రావు, బబ్బురి ఆనంద్కుమార్గౌడ్ పాల్గొన్నారు.
మన్సూరాబాద్, జూన్ 2: ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో అగ్రభాగాన నిలిచిందని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధి ఇందిరానగర్ కాలనీలో డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు టంగుటూరి నాగరాజు ఆధ్వర్యంలో బుధవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ఎమ్మెల్యే సుధీర్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తూ పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు.
ప్రపంచమే తెలంగాణ వైపు చూసేలా సీఎం కేసీఆర్ పాలన సాగుతుందన్నారు. సీఎం కేసీఆర్ను ఎన్నో రాష్ర్టాల ముఖ్యమంత్రులు ఆదర్శంగా తీసుకుని పాలన కొనసాగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్రెడ్డి, డివిజన్ టీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు పోచబోయిన జగదీశ్యాదవ్, నాయకులు మంకాల సుధాకర్ నాయీ, ప్రవీణ్ ముదిరాజ్, ధన్పాల్గౌడ్, శ్రవణ్కుమార్గౌడ్, గణేశ్, ఎస్.నర్సింహ, విజయభాస్కర్రెడ్డి, రాకేశ్రెడ్డి, వెంకన్న, ఆంజనేయులు, శివ పాల్గొన్నారు.
వనస్థలిపురం, జూన్ 2: సంక్షేమం, అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉన్నామని మాజీ కార్పొరేటర్ పద్మానాయక్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని హస్తినాపురం డివిజన్లో పద్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ చౌరస్తాలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు రఘుమారెడ్డి, మహ్మద్ సయీద్, మేరెడ్డి ఉదయ్కుమార్రెడ్డి, శ్రీరాములు, నాగేశ్వరరావు, పెద్దకృష్ణ, భీంలాల్ తదితరులు పాల్గొన్నారు.