హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ స్కాష్ రాకెట్స్ చాంపియన్షిప్లో అరవింద్కుమార్, ఐశ్వర్య విజేతలుగా నిలిచారు. బుధవారం మాదాపూర్లో జరిగిన ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, భారత హ్యాండ్బాల్ సంఘం(హెచ్ఎఫ్ఐ)చీఫ్ జగన్మోహన్రావు ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు ట్రోఫీలు అందజేశారు. ఈ సందర్భంగా జగన్మోహన్రావు మాట్లాడుతూ ‘రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో హైదరాబాద్లో స్కాష్ క్రీడాభివృద్ధికి కృషి చేస్తాం. త్వరలో నగరంలో రెండు స్కాష్ అకాడమీలు ఏర్పాటు చేసే ఆలోచన ఉంది’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్కాష్ రాకెట్స్ సంఘం అధ్యక్షుడు రాజు, శ్రీశైలం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.