న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవుతుండటంతో సీబీఎస్ఈ, సీఐఎస్సీఈ 10, 12వ తరగతుల బోర్డు పరీక్షలను రద్దు చేయాలన్న డిమాండ్ పెరుగుతున్నది. ట్విట్టర్లో cancelboardexams2021 అనే హాష్ట్యాగ్ రెండు రోజులుగా ట్రెండింగ్లో ఉన్నది. ‘మే 4వ తేదీ నుంచి నిర్వహించనున్న సీబీఎస్ఈ, సీఐఎస్సీఈ బోర్డు పరీక్షలు రద్దు చేయాలి లేదా పరీక్షలను అన్లైన్లో నిర్వహించాలి’ అంటూ చేంజ్.ఆర్గ్ వెబ్సైట్లో రూపొందించిన పిటిషన్పై లక్ష మందికి పైగా విద్యార్థులు సంతకాలు చేశారు. అయితే బోర్డు పరీక్షల రద్దు ఆలోచన లేదని సీబీఎస్ఈ, సీఐఎస్సీఈ స్పష్టం చేశాయి. ఇదివరకు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు జరుగుతాయని సీఐఎస్సీఈ స్పష్టం చేసింది.