ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో భాగంగా రాజస్థాన్ రాయల్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ 36 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న జయదేవ్ ఉనద్కత్ సంచలన బౌలింగ్తో టాప్-3 వికెట్లును పడగొట్టాడు. పృథ్వీ షా(2), శిఖర్ ధావన్(9), రహానె(8)లను తన వరుస ఓవర్లలో పెవిలియన్ పంపి ఢిల్లీని దెబ్బ కొట్టాడు. 6 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ 3 వికెట్ల నష్టానికి 36 పరుగులు చేసింది. ప్రస్తుతం మార్కస్ స్టాయినీస్(0), రిషబ్పంత్(15) క్రీజులో ఉన్నారు.