-సాయంత్రంకల్లా వెలువడే అవకాశం
న్యూఢిల్లీ, జూలై 19: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పదో తరగతి పరీక్ష ఫలితాలు మంగళవారం(నేడు) వెలువడనున్నట్టు సమాచారం. సాయంత్రానికల్లా ఫలితాలను ప్రకటించే అవకాశమున్నదని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే, దీనిపై సీబీఎస్ఈ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. సీబీఎస్ఈ వెబ్సైట్తోపాటు డిజిలాకర్ యాప్లో ఫలితాలు చూడవచ్చు. కరోనా నేపథ్యంలో ఈసారి పది పరీక్షలు రద్దయిన విషయం తెలిసిందే. ప్రత్యామ్నాయ మూల్యాంకన విధానం ద్వారా ఫలితాలను ప్రకటించనున్నారు.