న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు రూ వందకు చేరి వాహనదారులకు చెమటలు పట్టిస్తున్న క్రమంలో పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం తగ్గించేందుకు ప్రభుత్వం సంసిద్ధమైంది. పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీ రేట్లను తగ్గిస్తామని కేంద్ర ప్రత్యక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డు (సీబీఐసీ) చీఫ్ ఎం అజిత్ కుమార్ స్పష్టం చేశారు. సమయానుకూలంగా పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకం తగ్గింపుపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
సుంకాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం అన్ని అవకాశాలను పరిశీలిస్తుందని తెలిపారు. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకాన్ని సరైన సమయంలో తగ్గిస్తామన్న సీబీఐసీ చీఫ్ అందుకు నిర్ధిష్ట కాలపరిమితిని మాత్రం వెల్లడించలేదు. కాగా పెట్రోల్పై లీటర్కు రూ 13 మేరకు గత ఏడాది ఎక్సైజ్ సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం పెంచింది. ప్రస్తుతం పెట్రోల్పై లీటర్కు రూ 33 ఎక్సైజ్ సుంకం కింద వసూలు చేస్తున్నారు. ఇక డీజిల్పై లీటర్కు రూ 31.80 ఎక్సైజ్ సుంకం వసూలు చేస్తున్నారు.