న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: వంద మందికి కొవిడ్ సోకితే అందులో 85 మందికి మెడికల్ ఆక్సిజన్, రెమ్డెసివిర్ అవసరం అసలే రాదని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్ గులేరియా అన్నారు. కేవలం 10-15 శాతం మందిలో అది కూడా వ్యాధి తీవ్రత చాలా ఎక్కువ ఉన్నవారికి, ఆక్సిజన్తో వైద్యం అందిస్తున్నవారికే రెమ్డెసివిర్ వాడతారని చెప్పారు. వ్యాధి సోకిన వారిలో 80-85శాతం మంది యోగా, ఆవిరిపట్టడం, బలవర్ధకమైన ఆహారం తీసుకోవడంతోనే కోలుకొంటారని చెప్పారు. ప్రజలు, కంపెనీలు ఎవరూ మందులను, ఆక్సిజన్ను కొని దాచుకోవద్దని, ఇలాంటి చర్యల వల్ల నిజంగా అవసరమైనవారికి ఇబ్బంది తలెత్తుతుందని అన్నారు.