కరోనా వైరస్ కారణంగా కొత్త సినిమాలు విడుదల కావడం లేదు. ఒకవేళ విడుదలైనా కూడా ప్రేక్షకులకు తెలియడం లేదు. ఇలాంటి సమయంలో చాలా సినిమాలకు డిజిటల్ ప్లాట్ ఫామ్ అండగా నిలుస్తుంది. ఈ క్రమంలోనే అనసూయ హీరోయిన్ గా నటించిన థాంక్యూ బ్రదర్ సినిమా కూడా విడుదలైంది. ఈ మధ్య ఎక్కువగా తెలుగు సినిమాలను విడుదల చేస్తున్న ఆహా వేదికగా థాంక్యూ బ్రదర్ రిలీజ్ అయింది. కొత్త దర్శకుడు రమేష్ పామర్తి తెరకెక్కించిన ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వస్తుంది.
మే 7న ఈ సినిమాలో ఓటిటిలో విడుదల చేశారు. అందరికీ తెలిసిన కథనే రొటీన్ స్క్రీన్ ప్లేతో తెరకెక్కించాడు దర్శకుడు రమేష్. తండ్రి చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకొని వేరే అతడితో ఉన్న తల్లిపై చిన్నప్పటి నుంచి కోపం పెంచుకుంటాడు హీరో విరాజ్ అశ్విన్. దాంతో ఆయనకు చిన్నప్పటి నుంచి తల్లి అంటే కోపం. మరోవైపు ఫ్యాక్టరీలో జరిగిన ఓ ప్రమాదంలో భర్తను కోల్పోయిన అమ్మాయిగా నటించింది అనసూయ. ఎలాంటి అండదండ లేని నిరాధారమైన మహిళ ఈమె. గర్భంతో ఉన్న అనసూయ ఒకరోజు అనుకోకుండా లిఫ్ట్ లో ఇరుక్కుపోతుంది.
ఆమెతో పాటు అదే లెఫ్ట్ లో విరాజ్ అశ్విన్ కూడా ఉంటాడు. అసలు తల్లి అంటే గౌరవం లేని హీరో.. గర్భంతో ఉన్న అనసూయకు ఎలా సాయం చేసాడు అనేది కథ. ఎంత ఎమోషనల్ గా చెప్పాల్సిన కథను చాలా నీరసంగా నెరేట్ చేశాడు దర్శకుడు అంటూ పెదవి విరుస్తున్నారు ప్రేక్షకులు. ఎక్కడా సరైన ఎమోషన్ పట్టుకోలేక కథను పూర్తిగా గాలికి వదిలేశాడు అంటూ విమర్శలు కూడా వస్తున్నాయి. అనసూయ లాంటి అద్భుతమైన పర్ఫార్మర్ అక్కడున్న కూడా ఆమెను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేకపోయాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. కేవలం గంటన్నర నిడివితో వచ్చినవి సినిమా ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయిందనే టాక్ ఎక్కువగా వినిపిస్తుంది. మరి ఈ సినిమాకు ఆహాలో వ్యూస్ ఎలా వస్తాయో చూడాలి.