ప్రయాగ్రాజ్: ఉత్తరప్రదేశ్లోని అఖాడా పరిషత్ అధ్యక్షుడు మహంతి నరేంద్ర గిరి అనుమానాస్పద మృతిపై దర్యాప్తు చేపట్టేందుకు సీబీఐ ఆరుగురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసింది. ప్రయాగ్రాజ్లో ఉన్న బాఘంబరి మఠంలో నరేంద్ర గిరి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే సూసైడ్ నోట్పై అనుమానాలు వ్యక్తం కావడంతో ఆయన మరణం ఓ మిస్టరీగా మారింది. దీంతో ఈ కేసును సీబీఐకి అప్పగించారు. మహంతి నరేంద్ర గిరి మృతిపై దర్యాప్తు చేపట్టేందుకు ఆరుగురు సభ్యుల సీబీఐ బృందం ప్రయాగ్రాజ్ చేరుకోనున్నది.
మరోవైపు ఈ మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆనంద గిరి, ఆద్యా ప్రసాద్ తివారీలను స్థానిక కోర్టులో హాజరుపరిచారు. ఆ ఇద్దర్నీ 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీలోకి పంపారు. నరేంద్ర గిరి మృతిపై అనుమానాలు ఉన్న నేపథ్యంలో భాఘంబరి ఘడి మఠం వారసుడి నియామకం విషయంలో జాప్యం జరిగే అవకాశాలు ఉన్నాయి. నరేంద్ర గిరి కేసులో దర్యాప్తు ఆధారంగా తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు. ఒకవేళ నరేంద్ర గిరి వద్ద లభ్యమైన సూసైడ్ నోట నకిలీదని తెలిస్తే, అప్పుడు మఠం సభ్యులు సంయుక్తంగా వారసున్ని ఎన్నుకుంటారు.