ఢిల్లీ : యస్ బ్యాంక్లో 2017-19లో రూ.466 కోట్లకు పైగా ప్రజల డబ్బు మళ్లించారనే ఆరోపణలపై గౌతమ్ థాపర్, అవంత రియాల్టీ, ఇతరులపై నమోదైన కేసులో సీబీఐ అధికారులు బుధవారం ఢిల్లీ, ఎన్సీఆర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. యెస్ బ్యాంక్లో ప్రజల డబ్బు మళ్లింపునకు సంబంధించిన మరో కేసులో థాపర్ ఇప్పటికే నిందితుడిగా ఉన్నాడు. బ్యాంకు మాజీ చీఫ్ రానా కపూర్కు సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ప్రస్తుత కేసులో రఘుబీర్ కుమార్ శర్మ, రాజేంద్ర కుమార్ మంగల్, తాప్సీ మహాజన్, వారి కంపెనీలు ఓస్టెర్ బిల్డ్వెల్ ప్రైవేట్ లిమిటెడ్, అవంత రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్, జాబువా పవర్ లిమిటెడ్ అధికారులపై కూడా సీబీఐ కేసు నమోదు చేసింది. బ్యాంక్ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ ఆశిష్ వినోద్ జోషి 27 మే,2021 నాటి ఫిర్యాదుపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఢిల్లీ, సికింద్రాబాద్, కోల్కతా సహా నిందితులకు సంబంధించిన 15 ప్రాంతాల్లో సీబీఐ అధికారులు ఇవాళ సోదాలు నిర్వహించారు.