కనగల్ : మండలంలోని తేలకంటిగూడెం గ్రామానికి చెందిన దాత రంగనాయకులు సహకారంతో సర్పంచ్ బోగరి రాంబాబు కరోనా పేషెంట్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా వచ్చిన వారు మనో ధైర్యం కోల్పోవద్దన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ బాషరాజు సైదులు, నామ శ్రీనివాస్, బైరగోని సుజాత, నాగయ్య, సురేశ్, నందకుమార్, నవీన్, మణికుమార్, శివ నాగరాజు, సిబ్బంది చంద్రకళ తదితరులున్నారు.
కేతేపల్లి : మండలంలోని ఇనుపాముల గ్రామంలో కరోనా సోకిన కుటుంబాలకు జీఎమ్మార్ వరలక్ష్మి గ్రూప్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ జాల వెంకట్రెడ్డి మాట్లాడుతూ కరోనా సోకిన వారు అధైర్యపడ్డవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు శ్రీనివాస్రెడ్డి, గోపాల్, కార్తీక్, నాగకృష్ణ పాల్గొన్నారు.
తొరగల్లో..
నల్లగొండ రూరల్ : మండలంలోని తొరగల్ గ్రామంలో కరోనా పాజిటివ్ వచ్చిన వారికి గ్రామ పంచాయతీ పాలకవర్గం చేయూతనిచ్చింది. గ్రామంలో కరోనా సొకిన 30 మందికి ఒర్కొక్కరికి 30 గుడ్లు, పాలు, మాస్కులు, శానిటైజర్లు సర్పంచ్ ఏడ్ల అండాలుమంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాధితులు అధైర్యపడవద్దన్నారు. వారంలో మూడు సార్లు వీధులన్నీ సోడియం హైపోక్లోరైట్ తో పిచికారీ చేయిస్తున్నామన్నారు. కార్యక్రమంలో భాస్కర్, ఉప సర్పంచ్ చింత విజయ్, ఎస్ఎంసీ చైర్మన్ బత్తుల వెంకన్న, గ్రామ శాఖ అధ్యక్షుడు సింగం యాదయ్య, వార్డు సభ్యులు పిచ్చయ్య, సుశీల, ఆశ వర్కర్ విజయ పాల్గొన్నారు.
మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ
రామగిరి : లాక్డౌన్లో వివిధ ప్రాంతాల్లో సేవలందిస్తున్న పోలీసులకు విశ్వ హింద్ పరిషత్(వీహెచ్పీ), బజరంగ్దళ్ ఆధ్వర్యంలో మినరల్ వాటర్ బాటిల్స్, మజ్జిగ ప్యాకెట్లు అందించారు. కార్యక్రమంలో వీహెచ్పీ జిల్లా అధ్యక్షుడు కర్నాటి యాదగిరి, సహయ కార్యదర్శి జూకూరి సంపత్వర్మ, నగర అధ్యక్షుడు రాయల కృష్ణయ్య, సహాయ కార్యదర్శి నంద్యాల ప్రకాశ్రెడ్డి, నగర సత్సంగ్ బల్లెం యాదగిరి ఉమ్మడి జిల్లా సంఘటన కార్యదర్శి కన్నెబోయిన వెంకట్ పాల్గొన్నారు.
సోడియం హైపోక్లోరైట్ పిచికారీ
చిట్యాల : స్థానిక కూరగాయల మార్కెట్లో కొత్తగా ఏర్పాటు చేసిన ట్రాక్టర్ ట్యాంకర్తో సోడియం హైపోక్లోరైట్ పిచికారీని చైర్మన్ కోమటిరెడ్డి చిన వెంకట్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కూరగాయల వ్యాపారులతో మాట్లాడుతూ కొవిడ్ నిబంధనల కనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వ్యాపారాలు కొనసాగించాలని, విధిగా మాస్కులు వాడుతూ శానిటైజ్ చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, కౌన్సిలర్లు కోనేటి కృష్ణ, బెల్లి సత్తయ్య, రెముడాల లింగస్వామి, నాయకులు సిలివేరు శేఖర్, ఎండీ షుకూర్, జిట్ట బొందయ్య, దాసరి నర్సింహ, యాదయ్య పాల్గొన్నారు.
మర్రిగూడ : మండలంలోని శివన్నగూడెం సర్పంచ్ చిట్యాల సబితాయాదగిరిరెడ్డి మురుగు కాల్వల్లో బ్లీచింగ్ పౌడర్ను చల్లించి సోడియం హైపోక్లోరైట్ పిచికారీ చేయించారు. చెత్తను గ్రామ పంచాయతీ ట్రాక్టర్ వచ్చినప్పుడు అందులో వేయాలని కోరారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ సంకబుడ్డి మమత,వార్డు సభ్యులు శిశుపాల్రెడ్డి,ఆకారపు శ్రీను పాల్గొన్నారు.
ఈదులూరులో కరోనా మృతుడికి అంత్యక్రియలు
కట్టంగూర్ :మండలంలోని ఈదులూరు గ్రామానికి చెందిన వ్యక్తి మంగళవారం కరోనాతో మృతి చెందాడు. సర్పంచ్ ఐతగోని నారాయణ సొంత ఖర్చులతో మృతదేహాన్ని శ్మశాన వాటికకు తీసుకెళ్లి అంత్యక్రియలే జరిపించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.