తేజస్వీతోపాటు 518 మందిపై కేసు

పట్నా: కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా బీహార్లో భారీ నిరసన ప్రదర్శన చేపట్టిన ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ఆ పార్టీకి చెందిన 18 మంది నేతలతోపాటు గుర్తు తెలియని 500 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా పట్నాలోని గాంధీ మైదాన్లో శనివారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడంపై అంటు వ్యాధుల చట్టంతోపాటు ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా ఈ కార్యక్రమానికి రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రైతులతో కలిసి తేజస్వి యాదవ్ కూడా గాంధీ మైదాన్లో బైఠాయించారు. ఈ సందర్భంగా నిరసనకారులు కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రం వెంటనే రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆర్జేడీ అధ్యక్షుడు తేజస్వి యాదవ్.. ఇటీవల కేంద్రం చేసిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
- చలి గుప్పిట ఢిల్లీ.. కప్పేసిన పొగమంచు..
- ప్రధాని చెప్పారు.. ఈటల పాటించారు
- 13 ఏళ్ల బాలికపై తొమ్మిది మంది లైంగిక దాడి
- వేములవాడలో చిరుతపులి కలకలం
- అన్ని పోలీస్స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు : సీఎం
- కష్టాల్లో భారత్.. కెప్టెన్ రహానే ఔట్
- రిపబ్లిక్ డే పరేడ్.. ట్రాఫిక్ ఆంక్షలు
- 23 వరకు ప్రెస్క్లబ్లో ప్రత్యేక బస్పాస్ కౌంటర్
- టీఎస్ఆర్టీసీలో అప్రెంటిస్లు
- మహారాష్ట్రలో నిలిచిన కొవిడ్ టీకా పంపిణీ