“శశి’ చిత్ర కథ విన్నప్పుడు థ్రిల్గా ఫీలయ్యా. గాఢమైన భావోద్వేగాలు కలబోసిన ప్రేమకథా చిత్రమిది. ధైర్యవంతురాలైన అమ్మాయిగా నా పాత్ర భిన్న కోణాల్లో సాగుతుంది’ అని చెప్పింది కథానాయిక సురభి. తెలుగులో బీరువా, ఎక్స్ప్రెస్రాజా, ఎటాక్, జెంటిల్మెన్, ఒక్కక్షణం చిత్రాలతో సుపరిచితురాలైన ఈ భామ నటిస్తున్న తాజా చిత్రం ‘శశి’. శ్రీనివాస్ నాయుడు దర్శకుడు. ఈ నెల 19న విడుదలకానుంది. సురభి మాట్లాడుతూ ‘ఈ సినిమాలో తండ్రి గారాల కూతురిగా కనిపిస్తా. మా తల్లిదండ్రులకు నేను ఒక్క కూతురినే కాబట్టి ఈ పాత్రతో బాగా కనెక్ట్ అయ్యా. కాలేజీలో అల్లరి అమ్మాయిగా కనిపించినా…నా పాత్రకు మరో కోణం ఉంటుంది. అదేమిటో తెరపై చూస్తేనే బాగుంటుంది. ఇప్పటికి 13 సినిమాల్లో నటించా. తమిళంలో ఎక్కువ చిత్రాలు చేశాను. గ్లామర్ పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉన్నా. పౌరాణిక చిత్రాల్లో నటించాలనుంది. బలమైన పాత్రలు వస్తే వెబ్సిరీస్ కూడా చేస్తాను’ అని చెప్పింది.