హుస్నాబాద్టౌన్, మార్చి 25: ఆయిల్ పామ్ పంట సాగుతో రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని హుస్నాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న అన్నారు. పట్టణంలోని రైతు వేదికలో గురువారం అయిల్పామ్పై రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ అయిల్పామ్ ఎకరాకు 14 టన్నుల దిగుబడి వస్తుందని, మార్కెట్ లో సైతం ఈ పంటకు మంచి డిమాండ్ ఉందని చెప్పారు. ఆయిల్పామ్ ఫీల్డ్ అధికారి రామకృష్ణ మాట్లాడుతూ జిల్లాలో 50వేల ఎకరాల్లో పంట సాగు చేసుకునేందుకు అనుమతులు ఉన్నాయని చెప్పారు. కార్యక్రమంలో హార్టికల్చర్ అధికారి రవళి, మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు అయిలేని శంకర్రెడ్డి, ఆర్ఎస్ఎస్ కోఆర్డినేటర్ భాషవేని రాజయ్య, ఏఈవో కీర్తికుమారి, మిల్కూరి రవి, రైతులు ఉన్నారు.
అక్కన్నపేటలో రైతులకు అవగాహన
అక్కన్నపేట, మార్చి 25: ఆయిల్పామ్ పంటపై రైతులకు అక్కన్నపేటలో అవగాహన కల్పించారు.ఆయిల్పామ్ పం టను సాగుచేసే రైతులకు ప్రభుత్వం సహాయం అందిస్తుందని ఏఈవో నబియా తెలిపారు. సర్పంచ్ ముత్యాల సంజీవరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు పెసరు సాంబరాజు, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ కందుల రాంరెడ్డి ఉన్నారు.
ఆయిల్పామ్తో అధిక లాభాలు
కోహెడ, మార్చి 25: ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు వస్తాయని కోహెడ ఎంపీపీ కొక్కుల కీర్తి అన్నారు. బస్వాపూర్ రైతు వేదికలో ఏవో భోగేశ్వర్ ఆయిల్పామ్ సాగుపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సును ఆమె ప్రారంభించి మాట్లాడారు. వ్యవసాయ శాఖ సిబ్బంది ఎప్పటికప్పుడు ఆయిల్పామ్ సాగుపై అవగాహన కల్పిస్తారని ఆమె తెలిపారు.