యాదాద్రి భువనగిరి : యాదగిరిగట్ట మున్సిపాలిటీ పరిధిలో కరోనా రెండో విడత విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు స్వచ్ఛంద లాక్డౌన్ను పాటించాలని నిర్ణయించారు. ఈ మేరకు నేటి నుంచి 15 వ తేదీ వరకు పది రోజుల పాటు మినీ స్వచ్ఛంద లాక్ డౌన్ ఉంటుందని మున్సిపాలిటీ వర్గాలు తెలిపాయి. బుధవారం మధ్యాహ్నం 2:00 గంటల తరువాత స్వచ్ఛంద బంద్ పాటించారు.
యాదగిరిగుట్టలో ప్రతి బుధవారం జరిగే వారాంతపు సంత కూడా నిలిపివేస్తున్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు. నేటి నుంచి ఈ నెల 15వ తేదీ వరకు అన్ని దుకాణ సముదాయాలు, అన్ని వ్యాపార సంస్థలు బంద్ పాటించాలని వ్యాపారస్తులు, స్థానిక ప్రజాప్రతినిధులు నిర్ణయించారు. పట్టణ ప్రజలు అందరూ మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలన్నారు.
ప్రజలు రోడ్ల పైకి రాకుండా స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. అత్యవసరాలైన మెడికల్ షాప్స్, పాలు, పండ్లు, కూరగాయలు, నిత్యావసర వస్తువులు బంద్ నుంచి మినహాయించినట్లు వారు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ఎన్నారైలు ఎల్లప్పుడు సీఎం కేసీఆర్ వెంటే..
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ : మొక్కలు నాటిన శ్రీనివాస్ గుప్తా
పీఎంవో వల్ల కాదు కానీ.. ఆ పని గడ్కరీకి అప్పగించండి: ప్రధానికి స్వామి సూచన