హైదరాబాద్ : వ్యాపారిపై ఓ వ్యక్తి కొడవలితో దాడి చేశాడు. ఈ ఘటన రాజేంద్రనగర్ పరిధి బుద్వేల్ గ్రామంలోని ప్రధాన రహదారిపై గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పాత గొడవలే దాడికి కారణంగా ప్రాథమిక సమాచారం. పశుగ్రాసం కొనుగోలు అంశంలో వ్యాపారి రమేశ్(35)పై వ్యవసాయదారుడు బాలయ్య(36) వాగ్వాదానికి దిగాడు.
ఆగ్రహం చెందిన బాలయ్య పక్కనే ఉన్న కొడలితో రమేశ్పై దాడికి పాల్పడ్డాడు. స్థానికులు వెంటనే బాధితుడిని రాజేంద్రనగర్లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. పోలీసులు హత్య కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.