దేవరకద్ర రూరల్, మే21: కరోనా వ్యాప్తి పెరుగుతున్న గ్రామాలను గుర్తించి కొత్త కేసులు నమోదు కాకుండా చూసుకోవాలని వైద్యాధికారి బాల్రాం, ప్రజాప్రతినిధులకు ఎమ్మె ల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సూచించారు. చిన్న చింతకుంట మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా పరిషత్ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వైద్యులతో మాట్లాడుతూ ప్రతి రోజు ఎన్ని కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారని, వ్యాధి నిర్ధారణ అయినవారికి సరైన మందులు ఇవ్వాలని సూచించారు. ఆరోగ్య కేంద్రంలో ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. దవఖానలో కేసీఆర్ కిట్ను అందజేశారు. అనంత రం ఏదులాపూర్ గ్రామశివారులో ఊకచెట్టు వాగులో నూతనంగా నిర్మిస్తున్న చెక్డ్యాం నిర్మాణ పనులు ఎమ్మెల్యే పరిశీలించారు. నాణ్యతలోపం లేకుండా సకాలంలో పూర్తిచేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ హర్షవర్ధన్రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కోటరాము, నాయకులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబాలకు పరామర్శ
చిన్న చింతకుంట మండలంలోని లాల్కోట గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త సందీప్ కొద్ది రోజుల క్రితం కరో నాతో మృతి చెందగా, శుక్రవారం ఎమ్మెల్యే ఆల వెంక టేశ్వర్రెడ్డి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, రూ. 15వేల ఆర్థిసాయం అందజేశారు. అదేగ్రామానికి చెందిన బోయ వెంకటన్న మృతిచెందిన విషయం తెలిసిన ఎమ్మెల్యే వారి కుటుంబసభ్యులను పరామర్శించి రూ.5వేల ఆర్థిక సాయం చేశారు. మాజీ సర్పంచ్ శ్రీనివాసులు, టీఆర్ఎస్ కార్యకర్త అమీర్ అనారోగ్యంతో మృతి చెందగా కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కరోనా బాధితుడికి భరోసా
మండలంలోని లక్ష్మిపల్లి గ్రామానికి చెందిన రేషన్ డీలర్ జగదీశ్వర్, ఆయన సతీమణి పరమేశ్వరీకి కొవిడ్ పాజిటివ్ వచ్చింది. విషయం తెలిసిన ఎమ్మెల్యే ఆల శుక్రవారం డీలర్కు వీడియో కాల్ చేసి మాట్లాడారు. అధైర్య పడకుండా ఉండాలని, అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.