ఎండలు అప్పుడే ఠారెత్తిస్తున్నాయి. పగటి పూట భానుడు భగభగలాడుతున్నాడు. దీంతో జనాలు ఎండ వేడిమిని తట్టుకోలేకపోతున్నారు.
అందుకే తమ దగ్గరకు వచ్చే కస్టమర్లకు నీడ అందించేందుకు హైదరాబాద్లోని చార్మినార్ వద్ద షాపుల యజమానులు ఇలా గొడుగులు ఏర్పాటు చేశారు.
ఇక నెక్లెస్రోడ్లోని జల విహార్లో అయితే సందర్శకులు ఇలా నీటిలో సేదతీరుతూ కాలక్షేపం చేశారు.