న్యూఢిల్లీ: కరోనా రెండో వేవ్ అందరినీ చుట్టుముడుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. పేదలకు అండగా నిలిచేందుకు మళ్లీ ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకాన్ని అమలు చేయనున్నది. దీనికింద ప్రతి పేద వాడికి వచ్చే రెండు నెలలు (మే, జూన్) ఐదు కిలోల బియ్యం ఉచితంగా సరఫరా చేయనున్నది. దీనికింద 80 కోట్ల మంది భారతీయులకు లబ్ధి చేకూరనున్నది. ఇందుకు ప్రభుత్వానికి రూ.26 వేల కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు.
గతేడాది కరోనాను కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది. ఈ సమయంలో ప్రతి పేదవాడికి ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద 5 కిలోల గోధుమలు లేదా బియ్యం ఉచితంగా పంపిణీ చేసింది.
గతేడాది మార్చిలో ప్రారంభించిన ఈ పథకం 2020 నవంబర్ వరకు పొడిగించింది. సాధారణంగా ఇచ్చే కోటా కంటే ఎక్కువగా బియ్యం లేదా గోధుమలు సరఫరా చేశారు.
అంతేకాదు.. ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకం కింద రేషన్ కార్డు హోల్డర్లు ఇస్తున్న కోటా కంటే అదనంగా ఐదు కిలోల గోధుమలు లేదా బియ్యం కొనుగోలు చేయడానికి అనుమతించారు. కిలో బియ్యం రూ.3, కిలో గోధుమలు రూ.2లకు విక్రయించారు.ఁ
బహిరంగ మార్కెట్లో కిలో గోధుమల ధర గతేడాది మార్చిలో రూ.27 ఉన్నా.. సబ్సిడీపై రెండు రూపాయలకే ఇస్తున్నట్లు కేంద్రం తెలిపింది. బహిరంగ మార్కెట్లో కిలో బియ్యం ధర రూ.37 పలుకుతుండగా, రూ.3లకు విక్రయించినట్లు వెల్లడించింది.
ఆక్సిజన్ సరఫరా అడ్డుకున్న వాళ్లను ఉరితీస్తాం.. హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
మహారాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రి ఇంట్లో సీబీఐ సోదాలు
క్రికెట్ దేవుడు పుట్టాడీరోజే.. చరిత్రలో ఈరోజు
స్టీల్ ప్లాంట్ల నుంచి 1.43 లక్షల మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరాలు!
ఆక్సిజన్ కు కటకట : అలాగైతే 24 గంటల్లో వ్యవస్థ కుప్పకూలుతుంది..
ఆక్సిజన్ కొరత.. ఆ దవాఖానలో కొత్త రోగులకు నో అడ్మిషన్
ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకుల రుణాలు.. ఎందుకంటే?!
ఆక్సిజన్ సిలిండర్ల బ్లాక్ మార్కెంటింగ్ : నిందితుడు అరెస్ట్
మహేష్ ఖాతాలో మరో రికార్డ్.. మైండ్ బ్లాక్ చేసిన సూపర్ స్టార్
సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు