ముంబై: బయట పార్క్ చేసిన కారు అంతా చూస్తుండగా నీటి గుంతలో మునిగి మాయమైంది. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ ఘటన జరిగింది. వర్షా కాలం నేపథ్యంలో ముంబైలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు చోట్ల భూమి కుంగి నీటి గుంతలు ఏర్పడుతున్నాయి. ఘాట్కోపర్ ప్రాంతంలో బయట పార్క్ చేసిన కారు నీటి గుంతలో మునిగి క్షణంలో మాయమైంది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.