పట్నా: బీహార్లోని బెగుసరైలో పెను ప్రమాదం తప్పింది. స్కూలు పిల్లలతో వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి నదిలో పడింది. అయితే అందులో ఉన్న పిల్లలు క్షేమంగా బయటపడ్డారు. శుక్రవారం ఉదయం ఓ బొలేరో కారులో డజనుకుపైగా పిల్లలు స్కూలుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో సూర్య పురా గ్రామం సమీపంలో అదుపుతప్పిన కారు బోల్తా పడి పక్కనే ఉన్న నదిలోకి దూసుకెళ్లింది. గమనించిన స్థానికులు కారులో ఉన్న చిన్నారులను రక్షించారు. అందులో ముగ్గురు చిన్నారులను దవాఖాను తరలించారు. మిగిలినవారు క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.