ఢిల్లీ : కేంద్ర మంత్రివర్గ కార్యదర్శి రాజీవ్ గౌబా పదవీకాలాన్ని మోదీ ప్రభుత్వం ఏడాది కాలం పాటు పొడిగించింది. రాజీవ్ గౌబా 2019లో కేంద్ర కేబినెట్ కార్యదర్శిగా నియమితులయ్యారు. 30 ఆగస్టు,2021తో ఆయన పదవీ కాలం ముగుస్తుంది. కాగా తాజా పొడిగింపుతో రాజీవ్ గౌబా 30 ఆగస్టు,2022 వరకు పదవీలో కొనసాగనున్నారు.
1982 జార్ఖండ్ ఐఏఎస్ క్యాడర్కు చెందిన రాజీవ్ గౌబా గతంలో హోం సెక్రటరీగా ఉన్నారు. కేంద్రంలో పట్టణ వ్యవహారాలు, హౌసింగ్ కార్యదర్శిగా కూడా పనిచేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదించిన అనంతరం డీవోపీటీ గౌబా పదవీకాలాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.