న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో ఉన్న టెలికం రంగానికి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. ఆ కంపెనీలు చెల్లించాల్సిన స్పెక్ట్రమ్ బకాయిలపై మారటోరియానికి కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. వేల కోట్ల స్పెక్ట్రమ్ బకాయిలు ఉన్న వొడాఫోన్ ఐడియాలాంటి టెలికం కంపెనీలకు ఈ నిర్ణయం ఊరట కలిగించేదే. గత నెల 4న వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన కుమార మంగళం బిర్లా.. సంస్థలోని తన వాటాను ప్రభుత్వానికి లేదా ప్రభుత్వం ఆమోదించే ఏ సంస్థకైనా ఫ్రీగా ఇచ్చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే.
గత కొన్నేళ్లుగా వొడాఫోన్ ఐడియా రూ.50,399 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. అయితే చట్టబద్ధంగా టెలికం కంపెనీలు చెల్లించాల్సిన మొత్తాన్ని బెయిల్ఔట్ చేయడం ఏంటని ప్రభుత్వంలోని కొందరే ప్రశ్నిస్తున్నారు.