సంగారెడ్డి: జిల్లాలో దారుణం జరిగింది. నొప్పులు వస్తుండటంతో ఓ గర్భిణి ప్రభుత్వ దవాఖానకు వెళ్లింది. అయితే హాస్పిటల్కు తాళాలు వేసి ఉండటంతో ఆరుబయటే ప్రసవించింది. ఈ ఘటన న్యాల్కల్ మండలం మీర్జాపూర్లో చోటుచేసుకుంది. బుధవారం ఉదయం 7.30 గంటలకు ఓ గర్భిణి ప్రసవం కోసం మీర్జాపూర్ సర్కారు దవాఖానకు వచ్చింది. అయితే అప్పటికి ఇంకా దవాఖాన తలుపులు తెరవలేదు. నొప్పులు తీవ్రం కావడంతో హాస్పిటల్ బయటే బంధువులు ఆమెకు ప్రసవం చేశారు. అనంతరం అంబులెన్సులో తల్లి, శిశువును జహీరాబాద్ దవాఖానకు తరించారు. తల్లీ బిడ్డలు ఇద్దరు క్షేమంగానే ఉన్నారని బంధువులు వెల్లడించారు.