ముంబై: పోర్నోగ్రఫీ కేసులో అరెస్టయిన ప్రముఖ వ్యాపారవేత్త, బాలీవుడ్ కథానాయిక శిల్పాశెట్టి భర్త రాజ్కుంద్రాకు బెయిల్ లభించింది. ముంబైలోని మెట్రోపాలిటన్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. సినిమా అవకాశం కోసం ముంబైకి వచ్చిన పలువురు యువతులను వంచించి రాజ్కుంద్రా భారీగా ఆర్జించినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. దాంతో రెండు నెలల క్రితం పోర్నోగ్రఫీ కేసులో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
అయితే, ఈ కేసులో విచారణ ముగిసిన నేపథ్యంలో తనకు బెయిల్ మంజూరు చేయాలని రాజ్కుంద్రా శనివారం ముంబై మెట్రోపాలిటన్ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తనను తప్పుగా ఇరికించారని, ఎఫ్ఐఆర్లో పేరు లేకపోయినా పోలీసులే తనను కేసులోకి లాగారని ఆరోపించారు. ఆయన పిటిషన్పై ఇవాళ విచారణ చేపట్టిన ముంబై న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.