సుబేదారి, ఏప్రిల్ 8 : హన్మకొండలోని వరంగల్ అర్బన్ జిల్లా పరిషత్ హాల్లో అవుట్ సోర్సింగ్ స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి అధికారులు గురువారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. 25 పోస్టులకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 450 మంది అభ్యర్థులు హాజరయ్యారు. కమిటీ చైర్మన్, వరంగల్ అర్బన్ జడ్పీ ఇన్చార్జి సీఈవో శ్రీనివాస్ కుమార్, కన్వీనర్, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ లలితాదేవి, ఎంజీఎం సూపరింటెండెంట్ నాగార్జునరెడ్డి, సీకేఎం, హన్మకొండ ప్రభుత్వ మెటర్నిటీ, టీబీ దవాఖానల సూపరింటెండెంట్లు అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించారు. అభ్యర్థులకు టోకెన్లు ఇచ్చి నంబర్ల వారీగా పిలిచారు. మెరిట్ను పరిగణలోకి తీసుకొని ఆన్లైన్లో నమోదు చేశారు. ఉదయం 11 నుంచి సాయంత్రం వరకు ఇంటర్వ్యూలు కొనసాగాయి. కొందరు మహిళా అభ్యర్థులు చిన్న పిల్లలతో హాజరయ్యారు. 430 మంది మహిళా అభ్యర్థులు, 20 మంది పురుషులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
కోమటి చెరువుపై నెక్లెస్ రోడ్.. ప్రారంభించిన మంత్రి హరీశ్రావు
ప్రభుత్వ పథకాల అమలుకు నిరంతర కృషి : టీజీవో