రాజస్ధాన్ : కరోనా సెకండ్ వేవ్ తగ్గుమఖం పడుతుండగా రాజస్ధాన్లో భారీ ఊరట కలిగించే పరిణామం చోటుచేసుకుంది. సెకండ్ వేవ్ ప్రబలిన 85 రోజుల తర్వాత రాజస్ధాన్లో తొలిసారిగా గురువారం ఒక్క మరణం చోటుచేసుకోకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. నెలల తరబడి కరోనా మరణాలతో తల్లడిల్లిన క్రమంలో గురువారం ఒక్క కొవిడ్ మరణం కూడా నమోదు కాకపోవడం సంతృప్తికరమని రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ పేర్కొన్నారు.
కొవిడ్ పోరులో తాము ప్రేమించే వారిని కోల్పోయిన వారందరికీ సీఎం గెహ్లోత్ నివాళులు అర్పించారు. ఇప్పటివరకూ కరోనా బారినపడి రాష్ట్రంలో 8905 మంది మరణించారు. ఇక రాజస్ధాన్లో క్రియాశీల కేసులు 2019కి తగ్గగా తాజా కేసులు 147గా నమోదయ్యాయి. పెద్దసంఖ్యలో కరోనా రోగులు కోలుకోవడంతో రాష్ట్రంలో రికవరీ రేటు 99 శాతానికి ఎగబాకింది.