బుద్గాం: జమ్మూకశ్మీర్లోని బుద్గాం జిల్లాలో సుమారు 1200 ఏళ్ల క్రితం నాటి దుర్గాదేవి విగ్రహం లభ్యమైంది. బుద్గాంలోని ఖాన్ సాహిబ్లో ఆ విగ్రహం చిక్కింది. రాష్ట్ర పురావస్తు శాఖ డైరక్టర్ ముస్తాక్ అహ్మద్ బేగ్కు ఆ విగ్రహాన్ని అందజేశారు. శ్రీనగర్ సమీపంలో ని పంద్రేతన్ వద్ద ఉన్న జీలం నదిలో దుర్గాదేవి విగ్రహం దొరికినట్లు తెలుస్తోంది. ఆగస్టు 13వ తేదీన నది నుంచి ఇసుక తొవ్వుతున్న సందర్భంలో కార్మికులకు ఈ విగ్రహం చిక్కింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అందాల్సి ఉంది.