లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అలీగఢ్ జిల్లాలో కల్తీ మద్యం సేవించి మరణించిన వారి సంఖ్య 22కు చేరింది. శుక్రవారం సాయంత్రానికి 15 మంది మృతిచెందగా.. శుక్రవారం రాత్రి నుంచి శనివారం మధ్యాహ్నానికి మరో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. దాంతో మొత్తం మృతుల సంఖ్య 22కు చేరింది. మరో 28 మంది పరిస్థితి విషమంగా ఉన్నదని వైద్యులు తెలిపారు.
అలీగఢ్లోని లోధా, ఖైర్, జవాన్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని వివిధ గ్రామాల్లో కల్తీ మద్యం సేవించి 15 మంది ప్రాణాలు కోల్పోయారని శుక్రవారం ఆ జిల్లా అధికారులు ప్రకటించారు. ఆ తర్వాత మృతుల సంఖ్య 22కు చేరింది. ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారిలోనూ కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. కల్లీ మద్యం తయారీదారులే ఈ మరణాలకు కారణమని పోలీసులు తెలిపారు.