శ్రీనగర్: దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన పాకిస్థానీ ప్రయత్నించాడు. గుర్తించిన సరిహద్దు భద్రతా దళం అతన్ని కాల్చివేశాయి. జమ్ముకశ్మీర్లోని సాబా జిల్లాలో ఉన్న అంతర్జాతీయ సరిహద్దు వద్ద మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పాకిస్థాన్కు చెందిన ఓ వ్యక్తి చికటిని ఆసరాగా చేసుకుని దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించాడు. దీంతో అప్రమత్తమైన బీఎస్ఎఫ్ బలగాలు అతనిపై కాల్పులు జరిపాయి. దీంతో అతనికి వెనుకవైపు గాయాలయ్యాయని, అతన్ని సాంబాలోని బీఎస్ఎఫ్ దవాఖానకు తరలించామని అధికారులు తెలిపారు. అతడు లాహోర్కు చెందిన వ్యక్తి అని చెప్పారు.
కాగా, గత పదిహేను రోజుల్లో దేశంలోకి చొరబాటు దారులు రావడం ఇది రెండోసారి. మే 5న ఓ వ్యక్తి సాంబా జిల్లాలోని సరిహద్దుల నుంచి చొరబడేందుకు ప్రయత్నించగా బీఎస్ఎఫ్ అతన్ని కాల్పివేసింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి