వాఘా: బక్రీద్ సందర్భంగా పాకిస్థాన్, బంగ్లాదేశ్ సరిహద్దుల వద్ద జవాన్లు స్వీట్లు పంచుకున్నారు. పంజాబ్లోని అతారి-వాఘా బోర్డర్ వద్ద బోర్డర్ సెక్యూర్టీ ఫోర్స్కు చెందిన జవాన్లు.. పాకిస్థాన్ రేంజర్లకు స్వీట్లు అందజేశారు. ఈద్ అల్ అదా పండుగ నేపథ్యంలో రాజస్థాన్లోని బార్మర్ లో ఉన్న ఇంటర్నేషనల్ బోర్డర్ వద్ద బీఎస్ఎఫ్ జవాన్లు, పాకిస్థాన్ రేంజర్లు స్వీట్లు ఇచ్చి పుచ్చుకున్నారు. ఇక బంగ్లాదేశ్తో ఉన్న సౌత్ బెంగాల్ ఫ్రాంటియర్ వద్ద కూడా బంగ్లాదేశ్ బోర్డర్ గార్డులతో బీఎస్ఎఫ్ జవాన్లు స్వీట్లు పంచుకున్నారు.