లక్నో: ఒక వధువు పెండ్లిలో వరుడితో కబడ్డీ ఆడుకున్నది. వివాహానికి వచ్చిన వారు ఇది చూసి తెగ నవ్వుకున్నారు. ఉత్తరప్రదేశ్కు చెందిన జర్నలిస్ట్ మనీశ్ మిశ్రా పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పెండ్లి వేదికపై ఉన్న వధువరులు పూలదండలు మార్చుకునేందుకు సిద్ధమయ్యారు. తొలుత వధువు, వరుడి మెడలో పూలమాల వేసింది. అనంతరం వరుడు ఆమె మెడలో పూల దండ వేయబోగా ఆయనను ఆటపట్టించింది. తప్పించుకుని వేదిక చుట్టూ తిరిగింది. దీంతో చేతిలో పూల దండతో ఆ వరుడు ఆమె వెంట పడ్డాడు. చాలా సేపు వరుడితో కబడ్డీ ఆడుకున్న వధువు అనంతరం పూల దండ వేయించుకుంది. ఈ తతంగాన్ని చూసి పెండ్లికి వచ్చిన అతిథులు తెగ నవ్వుకున్నారు. కాబోయే భర్తను వధువు పెండ్లిలోనే ఆటాడుకుని లొంగదీసుకున్నదని చమత్కరించారు. కాగా ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.