బోథ్, ఏప్రిల్ 27 : పిల్లలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకే చిల్డ్రన్స్ పార్కును ఏర్పా టు చేశారని ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ రాజేశ్చంద్ర పేర్కొన్నారు. బోథ్ పోలీస్స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన చిల్డ్రన్స్ పార్కును మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ కుటుంబాల పిల్లల్లో మానసికోల్లాసం పెంపొందించేందుకు పార్కు దోహదపడుతుందన్నారు. కరోనా తగ్గుముఖం పట్టాక బోథ్ లోని పిల్లలు పార్కును సందర్శించవచ్చ న్నారు. ఆదిలాబాద్ డీఎస్పీ వెంకటేశ్వర్లు, బోథ్ సీఐ నైలు, బోథ్, బజార్హత్నూర్ ఎస్ఐలు, పీ రాజు, ఉదయ్కుమార్, ఏఎస్ఐ హన్మాండ్లు, ట్రైయినీ ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఆకట్టుకుంటున్న పార్కు..
బోథ్ సీఐ నైలు, బోథ్, బజార్హత్నూర్ ఎస్ఐలు రాజు, ఉదయ్కుమార్ తమ సొంత ఖర్చులతో చిల్డ్రన్స్ పార్కును ఏర్పాటు చేయించారు. పిల్లలు ఆడుకోవడానికి వీలుగా జారుడు బల్లలు, ఊయలలు, జిగ్జాగ్, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయించారు. మధ్యలో మొక్కలు నాటి పచ్చదనం కల్పించారు.