కొడంగల్, ఏప్రిల్ 1: సమీకృత మార్కెట్లు ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయని జిల్లా కలెక్టర్ పౌసుమిబసు పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని వెటర్నరీ భవనలో ఏర్పాటు చేసిన మున్సిపల్ బడ్జెట్ సమావేశానికి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డులో ప్రభుత్వ స్థలాల్లో పట్టణ ప్రకృతి వనం ఏర్పాటు చేసే విధంగా మున్సిపల్ కౌన్సిలర్లు ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు. వార్డుల్లో స్థలా లు అందుబాటులో లేవని సభ్యులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో మున్సిపల్ పరిధిలో 31 లేఔట్లలో ప్రభుత్వానికి కేటాయించిన స్థలా లను ప్రకృతివనాల ఏర్పాటుకు వాడుకోవాలని సూ చించారు. మున్సిపల్ పరిధిలో ఆధునిక వైకుంఠధామ నిర్మాణాన్ని చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని తెలి పారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికిగానూ రూ.25 కోట్లతో అంచనా బడ్జెట్ను ఆమోదించినట్లు అధికారులు తెలిపారు. సమావేశం అనంతరం పట్టణంలోని సంత బజార్లో రూ.కోటి నిధులతో ఏర్పాటు చేయనున్న సమీకృత మార్కెట్ స్థలాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జగదీశ్వర్రెడ్డి, వైస్ చైర్మన్ ఉషారాణి, మున్సిపల్ కమిషనర్తో పనుల పురోగతిపై మాట్లాడారు. సువిశాల ప్రదేశంలో వెజ్, నాన్వెజ్తో పాటు అన్ని వస్తువులు సౌకర్యాలతో కూడిన సమీకృత మార్కెట్ ఏర్పా టు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం నిర్మిస్తున్న ఇంటిగ్రెటెడ్ మార్కెట్ డిజైన్ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రజలు మరింత సౌకర్యవంతగా ఉండే విధంగా రెండు అంతస్తులతో కూడిన మా ర్కెట్ నిర్మాణం చేపట్టేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు. మార్కెట్ నిర్మాణానికి సంబంధించి కొత్తగా రీ డిజైన్ చేపట్టే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. 11వ వార్డులో మరుగుదొడ్ల నిర్మా ణం పనులు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ వెంకటలక్ష్మిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్ర య్య, మున్సిపల్ కౌన్సిలర్, కోఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండీ..
బీజేపీకి వ్యతిరేకంగా చేతులు కలుపుదాం.. సోనియాకు మమత లేఖ
ఫ్రస్టేషన్లో టార్చిలైట్ విసిరివేసిన కమల్ హాసన్
మాకు హిందూ ముస్లిం భేదం లేదు: అమిత్ షా