హైదరాబాద్ : ఇంటర్ సెకండియర్ పరీక్షల రద్దుపై ప్రభుత్వం జీవోను జారీ చేసింది. ఫలితాల వెల్లడికి అనుసరించే విధానం రూపొందించాలని ఇంటర్ బోర్డుకు ఆదేశాలు జారీ చేసింది. ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులను ప్రమోట్ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశించింది. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఇంటర్ సెకండియర్ పరీక్షలను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే.