నార్నూర్, మే 26 : పెండింగ్లో ఉన్న పల్లె ప్రగతి పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవా లని అదనపు జిల్లా కలెక్టర్ డేవిడ్ అధికారులకు సూచించారు. బుధవారం గాదిగూడ, నార్నూర్ మండలం జామాడ, ఖైరదట్వా, ఖడ్కి, లోకారి (కే), పర్సువాడ(కే), అర్జుని గ్రామాల్లో విస్తృతం గా పర్యటించారు. పల్లెప్రగతి పనులు పరిశీలిం చారు. పలె ్లప్రకృతి వనాలు, నర్సరీలను సందర్శిం చారు. జామాడలో ఉపాధి హామీ పనులను పరిశీలించారు. డీఆర్డీవో పీడీ కిషన్, ఎంపీడీవోలు రమేశ్, రామేశ్వర్, ఎంపీవోలు స్వప్నశీల, సాయి ప్రసాద్, ఈజీఎస్ ఏపీవోలు జాదవ్ శేషారావ్, అంబర్సింగ్, టెక్నిక ల్ అసిస్టెంట్ జాదవ్ సచిన్, సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.
ఉపాధి పనులు అందరికీ కల్పించాలి
ఇంద్రవెల్లి, మే 26 : గ్రామాల్లోని ప్రతి ఒక్క ఉపాధి కూలీకి పనులు కల్పించాలని, నర్సరీల్లో అన్ని రకాల మొక్కలు పెంచాలని జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్, డీఆర్డీవో కిషన్ పేర్కొన్నారు. మం డలంలోని ధనోరా(బి), ముత్నూర్, ఏమాయి కుంట గ్రామ పంచాయతీ పరిధిలో చేపట్టిన ఉపా ధి హామీ పనులను వారు పరిశీలించారు. కూలీల సంఖ్యను ఈజీఎస్ అధికారులను అడిగి తెలుసు కున్నారు. అనంతరం గ్రామాల్లో ఏర్పాటు చేసిన నర్సరీలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నర్సరీల్లో పిచ్చి గడ్డి కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఎంపీ డీవో పుష్పలత, ఎంపీవో సంతోష్, ఏపీవో సంతో ష్ జైస్వాల్, ఈసీ జాదవ్ శ్రీనివాస్, సర్పంచ్లు లఖన్సింగ్, జాకేశ్వర్, బాగుబాయి, టీఏలు జాదవ్ విఠల్, ప్రకాశ్, తదితరులు పాల్గొన్నారు.
మొక్కలు సిద్ధ్దం చేయాలి
ఉట్నూర్ రూరల్, మే 26 : హరితహారం ప్రారంభానికి మొక్కలు సిద్ధం చేయాలని జిల్లా అదనపు కల్టెర్ డేవిడ్ సూచించారు. బుధవారం మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏందా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఉపాధి నిధులతో ఏర్పాటు చేసిన నర్సరీలోని మొక్కలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ మొక్కలు ఎండిపోకుండా ప్రతి రోజూ నీరు అందించాలని సూచించారు. పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. ప్రకృతి వనాలు ఏర్పాటు తో గ్రామాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం సంతరించుకున్నదని పేర్కొన్నారు. అనంతరం రికార్డులు పరిశీలించారు. శ్యాంపూర్ గ్రామంలో ఉపాధి నిధులతో చెరువులు పునఃరు ద్ధరించాలని సూచించారు. ఇందులో డీఆర్డీవో కిషన్, ఎంపీడీ వో తిరుమల, ఎంపీవో మహేశ్, వైస్ ఎంపీపీ దావులే బాలాజీ, ఈజీఎస్ ఏపీవో రజినీకాంత్, శ్యాంపూర్, ఏందా సర్పంచ్లు మల్లిక, యశోద, ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్లు మల్లేశ్, శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శులు మహేందర్, విజయ్, తదితరులు పాల్గొన్నారు.