పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు లైగర్. పూరీ జగన్నాథ్-విజయ్ దేవరకొండ కాంబోలో వస్తున్న లైగర్ పై భారీగానే అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన లుక్లో బాక్సర్ గా విజయ్ అదరగొడుతున్నాడు. అనన్యపాండే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ బీటౌన్లో చక్కర్లు కొడుతోంది.
హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ అండీ లాంగ్ నేతృత్వంలో విజయ్దేవరకొండ అండ్ యాక్షన్ టీంపై ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో హై వోల్టేజి యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించాడట. రియాలిటీగా కనిపించేలా ముంబైలోని వేసిన స్పెషల్ సెట్లో ఈ యాక్షన్ ఎపిసోడ్ను షూట్ చేసిందట పూరీ అండ్ టీం.
ముంబైలో భారీ షెడ్యూల్ పూర్తి చేసింది విజయ్-పూరీ టీం. తర్వాతి షెడ్యూల్ త్వరలోనే ప్రకటించనుంది చిత్రయూనిట్. ఈ చిత్రాన్ని కరణ్ జోహార్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.