ప్రస్తుతం గగన విహారం చేస్తున్న ఎన్నో విమానాలు, హెలికాప్టర్లకు ఆద్యులు రైట్ బ్రదర్స్. వీరు చేసిన సాహస కార్యాలు, పరిశోధనల కారణంగానే దూరతీరాలు దగ్గరవుతున్నాయి. 115 సంవత్సరాల క్రితం రైట్ బ్రదర్స్ తాము కనిపెట్టిన ఎగిరే యంత్రానికి సరిగ్గా ఇదే రోజున పేటెంట్ వచ్చింది. అయితే, ఈరోజున మరో విషాదం కూడా జరిగింది. 11 సంవత్సరాల క్రితం కర్ణాటకలోని మంగుళూరులో ఇండియన్ ఎయిర్లైన్ విమానానికి జరిగిన ఘోర ప్రమాదంలో 158 మంది అసువులు బాసారు.
రైట్ సోదరులు ఓర్విల్లే, విల్బర్ .. ఇద్దరు అమెరికన్ అన్నదమ్ములు. వీరు ప్రపంచపు మొట్టమొదటి భారీ యాంత్రిక విమానాన్ని కనిపెట్టి నిర్మించారు. దానిని 1903 డిసెంబరు 17 న విజయవంతంగా గాలిలో ఎగిరించారు. 1905 నుంచి 1907 వరకు ఈ సోదరులు ప్లయింగ్ యంత్రాన్ని తొలి ఆచరణాత్మక స్థిర వింగ్ విమానంగా అభివృద్ధి పరచారు. అమెరికాలోని రైట్ సోదరులు తమ ఎగిరే యంత్రానికి 1906 మే 22 న పేటెంట్ పొందారు.
ఇంతటి ఘన కార్యం సాధించిన రోజునే భారతదేశంలోని మంగళూరులో ఘోర ప్రమాదం సంభవించింది. ఎయిర్ ఇండియా విమానం దుబాయ్ నుంచి మంగళూరుకు 2008 మే 22న బయల్దేరింది. అయితే ల్యాండింగ్ సమంయలో రాయిని ఢీకొట్టడంతో అగ్నిప్రమాదం సంభవించి విమానంలో ఉన్న 158 మంది అగ్నికి ఆహుతయ్యారు. కేవలం ఎనిమిది మందే ప్రాణాలతో బయటపడ్డారు.
ఈ ప్రమాదంపై దర్యాప్తు చేపట్టిన డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ (డీసీజీఏ).. ప్రమాదానికి పైలట్ను కారకుడిగా తేల్చింది. కో-పైలట్ హెచ్ఎస్ అహ్లువాలియా విమానం తప్పు మార్గంలో వెళ్తున్నట్లు పైలట్ గ్లూసికాకు హెచ్చరించినా పట్టించుకోలేదు. ప్రమాదానికి కొన్ని సెకన్ల ముందు రికార్డింగ్లో అహ్లువాలియా చివరి మాటలు నమోదయ్యాయి, దానిని బట్టి ప్రమాదానికి పైలట్ ప్రదాన కారకుడని తేల్చారు.\
2003: అల్జీరియాలో భూకంపం. రెండువేల మందికి పైగా మృతి
1988: దేశీయంగా అభివృద్ధి చేసిన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి అగ్నిని విజయవంతంగా పరీక్షించిన భారత్
1980 : ప్రసిద్ధ ఆర్కేడ్ గేమ్ పెక్-మెన్ ప్రారంభం
1972: రష్యా పర్యటనలో భాగంగా మాస్కో చేరిన అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ ఎం. నిక్సన్
1963: గాలిలోకి ఎగిరిన భారతదేశం యొక్క మొట్టమొదటి గ్లైడర్ రోహిణి
1960: చిలీ దక్షిణ తీరంలో అతిపెద్ద భూకంపం, 5,700 మంది మరణం
జీ-7 ఆరోగ్య మంత్రుల సమావేశానికి భారత్కు ఆహ్వానం
ఎన్నికల్లో అధిక ఖర్చుపై ఫ్రెంచ్ మాజీ అధ్యక్షుడిపై విచారణ
బ్లాక్ ఫంగస్ తర్వాత.. ఇప్పుడు వైట్ ఫంగస్ ఇబ్బందులు
అంటార్కిటికాలో అతిపెద్ద మంచుకొండ గుర్తింపు
ఇక మొబైల్ వాలెట్లు కూడా మార్చుకోవచ్చు.. ఆర్బీఐ సర్క్యులర్ జారీ
ఈ-కామర్స్పై ఫిర్యాదు ఇక సులభం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..