ముంబై: అవినీతి ఆరోపణల నేపథ్యంలో సీబీఐ తనపై కేసు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ వేసిన పిటిషన్పై విచారణను బాంబే హైకోర్టు వాయిదా వేసింది. కోర్టుకు వేసవి సెలవులు ముగిసిన తర్వాత ఈ కేసులో తదుపరి విచారణ జరుపనున్నట్లు తెలిపింది. అయితే, అనిల్ దేశ్ముఖ్ పిటిషన్పై నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని సీబీఐని న్యాయస్థానం ఆదేశించింది.
అయితే, సీబీఐ తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ అనిల్ దేశ్ముఖ్ చేసిన అభ్యర్థనను సీబీఐ తోసిపుచ్చింది. అత్యవసరం అనుకుంటే ఈ విషయంలో అనిల్ దేశ్ముఖ్ హైకోర్డు వేసవికాల ధర్మాసనాన్ని ఆశ్రయంచవచ్చని సూచించింది.