ప్రముఖ సినీ విమర్శకుడు, నటుడు కత్తి మహేశ్ అకాల మరణం అందర్నీ కలచివేస్తుంది. బతికి ఉన్నప్పుడు కత్తి మహేశ్ను అంతా తప్పుగా అర్థం చేసుకున్నారని ఆయన సన్నిహితులు బాధపడుతున్నారు. బయట ప్రపంచానికి తెలిసిన మహేశ్ వేరు.. లోపల ఉన్న మనిషి వేరు అని అంటున్నారు. వివాదాల్లో ఉంటాడనే పేరే కానీ కత్తి మహేశ్ మనస్తత్వం మాత్రం చాలా మంచిదని ఆయనతో ఉన్నవాళ్లు అంటున్నారు. ఇదిలా ఉంటే 43 ఏళ్ల వయసులోనే ఆయన చనిపోవడం మాత్రం విషాదమే.
కత్తి మహేశ్ స్వగ్రామమైన చిత్తూరు జిల్లా యర్రవారిపాలెం మండలం యలమందలో అంత్యక్రియలు నిర్వహించారు. కత్తి మహేశ్కు భార్య సోనాలితో పాటు ఓ కుమారుడు ఉన్నాడు. అయితే కొన్నేళ్ల కిందటే విభేదాల కారణంగా భార్యతో విడిపోయాడు కత్తి. అయినా చనిపోయే వరకూ ఆమెతో మంచి సంబంధాలే కొనసాగిస్తూ వచ్చాడు. కత్తి మహేశ్ను బతికించడానికి ఆయన బంధువులు చాలానే కష్టపడ్డారు. ఏపీ సీఎం జగన్ కూడా ఆస్పత్రి ఖర్చుల నిమిత్తం రూ.17 లక్షల ఆర్థికసాయం అందజేశారు. అయినప్పటికీ కత్తి ప్రాణాలు నిలబడలేదు. ఇవన్నీ పక్కన బెడితే ఆయనకు రెండు కోరికలు ఉండేవట. అవి తీరకుండానే వెళ్లిపోయాడు కత్తి.
అవేంటంటే.. మంచి నటుడిగా తెలుగు ఇండస్ట్రీలో నిలదొక్కకోవడం.. రాజకీయాల్లో రాణించడం. రెండూ మొదలు పెట్టాడు కానీ పూర్తి చేయకుండానే వెళ్లిపోయాడు కత్తి. 11 ఏళ్ల కిందే ఇండస్ట్రీకి వచ్చిన ఈయన.. సంపూర్ణేష్ బాబు హృదయ కాలేయం సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు. దర్శకులతో పరిచయాలు ఉన్నా కూడా కారెక్టర్స్ అడగటానికి మొహమాటం అడ్డొచ్చేది. అందుకే కత్తికి ఎక్కువగా అవకాశాలు రాలేదు. మరోవైపు రాజకీయాల్లోనూ రాణించాలని చాలా కాలంగా కోరుకున్నాడు కత్తి మహేశ్. ఏదేమైనా కూడా ఆ రెండు కోరికలు మాత్రం కత్తి విషయంలో అలాగే ఉండిపోయాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Kathi Mahesh | సినీ నటుడు కత్తి మహేశ్ మృతి
కడవరకు కాంట్రవర్సీలతోనే కాపురం చేసిన కత్తి మహేష్
ప్రమాదమే లేదన్నారు కదా.. మరి కత్తి మహేశ్ మరణానికి కారణమేంటి?
కత్తి మహేష్ది ప్రేమ వివాహం అనే సంగతి తెలుసా