కరోనా సెకండ్ వేవ్ వలన ఇంతక ముందు ప్రకటించిన చాలా చిత్రాలు వాయిదా పడ్డాయి. లవ్స్టోరీ, టక్ జగదీష్, విరాటపర్వం , చిరంజీవి ఆచార్య, వెంకటేష్ నారప్ప, బాలకృష్ణ అఖండ, రవితేజ ఖిలాడి, అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ సినిమాలు పోస్ట్ పోన్ అయ్యాయి. మరి కొన్ని సినిమాలు కూడా వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది. ఈ క్రమంలో సోనీ పిక్చర్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు సహా ఏ ప్లస్ ఎస్ మూవీస్ వారు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న మేజర్ చిత్రాన్ని వాయిదా వేశారు.
కరోనా వలన మేజర్ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన మేకర్స్ పరిస్థితులన్నీ చక్కబడ్డాక కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తామని అన్నారు. ముందుగా జూలై 2 న మేజర్ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా విడుదల చేయాలని అనుకున్నారు.ఇండియన్ రియల్ హీరో మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా దర్శకుడు శశికిరణ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో సాయి మంజ్రేకర్, శోభితా ధూళిపాళ్ల, సహా ప్రకాష్ రాజ్ తదితరులు నటించగా శ్రీ చరణ్ పాకల సంగీతం అందించాడు.