అభివృద్ధి పనులు వివరిస్తూ..ఓట్లను అభ్యర్థించండి
జనగామ : సీఎం కేసీఆర్ చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి పనులను పట్టభద్రులకు వివరించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పాలకుర్తి నియోజకవర్గ స్థాయి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమీక్ష సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమంతో పాటు బీజేపీ, ఇతర పార్టీల వైఫల్యాలను పట్టభద్రులకు వివరించాలన్నారు.
పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామన్నారు. నియోజకవర్గ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ అండగా ఉంటాను .
మండలస్థాయి, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి పట్టభద్రులను కలిసి ఓట్లను అభ్యర్థించాలన్నారు. ఇతర పార్టీలకు బుద్ధి చెప్పే విధంగా పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.